నేడు వారి ఖాతాల్లో నగదు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారు.

Update: 2021-11-16 03:04 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారు. గులాబ్ తుపాను కారణంగా నష్టపోయిన 34,586 మంది రైతులకు ఈ పరిహారం అందనుంది. వీరికి 22 కోట్ల రూపాయల పరిహారాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు జగన్.

ఏ సీజన్ లో నష్టం జరిగితే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఏ సీజన్ లో జరిగిన నష్టానికి ఆ సీజన్ లోనే పరిహారం అందించాలని నిర్ణయించారు. ఈమేరకు పంట నష్టం జరిగిన వెంటనే లెక్కలు కట్టి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ జగన్ పథకాల అమలును నిలిపి వేయలేదు.


Tags:    

Similar News