వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

వరద ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద తాకిడికి అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వారికి సహాయ కార్యక్రమాలను అందించాలని [more]

Update: 2020-08-18 06:31 GMT

వరద ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద తాకిడికి అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వారికి సహాయ కార్యక్రమాలను అందించాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. పంట నష్టం తీవ్రంగా ఉంది. అరటి, కూరగాయలు, కొబ్బరి తోటలు వరద దెబ్బకు నాశనమయిపోయాయి. దీంతో జగన్ ఈరోజు తూర్పు, గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. ఈ మేరకు జగన్ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News