సంక్షేమం కోసమే పదమూడు నెలలుగా

పదమూడు నెలలు గా సంక్షేమ కార్యక్రమాల అమలు చేసే దిశగానే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత [more]

Update: 2020-06-24 06:01 GMT

పదమూడు నెలలు గా సంక్షేమ కార్యక్రమాల అమలు చేసే దిశగానే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడో కోట్ల తొంభయి లక్షల మందికి వివిధ పథకాల ద్వారా లబ్దిని చేకూర్చామని చెప్పారు. లబ్దిదారుల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలను చూడలేదన్నారు. వివక్షతకు తావు లేకుండా పథకాలను అందచేస్తున్నామని జగన్ చెప్పారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. పదమూడు నెలలో 4,700 కోట్లను వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు అందజేసిందని జగన్ చెప్పారు. కాపు మహిళలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకే ఈ పథకమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను అమలు పర్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని జగన్ చెప్పారు.

Tags:    

Similar News

.