Ys Jagan : అంబటి నివాసానికి చేరుకోవడానికి ఆరు గంటలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంరబాబు నివాసానికి చేరుకున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంరబాబు నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమయిన ఇంటిని, కార్యాలయాన్ని తొలుత పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం పదిన్నర గంటల పెద్ద సంఖ్యలో ఆయన పర్యటనకు అభిమానులు తరలి వచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటనలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరుకు చేరుకున్న ఆయన అంబటిఇంటికి చేరుకోవడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అంబటి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంబటి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని చెప్పినా వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు.