Revanth Reddy : ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా

మున్సిపల్ ఎన్నికలు ముగిసన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2026-02-04 12:27 GMT

మున్సిపల్ ఎన్నికలు ముగిసన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించినట్లే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. తెలంగాణ జాతిపిత అంటున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని జాతిపిత అంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు జాతి? వినోద్ రావా? ఎర్రబెల్లి దయాకర్ రావా? హరీశ్ రావా? అని ప్రశ్నించారు. మొగుడు, పెళ్లాం మాట్లాడుకుంటుంటే వారి ఫోన్లను కూడా వినేందుకు ప్రయత్నించారని రేవంత్ ెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుందని అన్నారు. మంది ఫోన్లు వినేవాడు మనేషానా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

అన్ని మున్సిపాలిటీలను...
మున్సిపల్ ఎన్నికల్లో నల్గగొండ జిల్లాలోని పద్దెనిమిది మున్సిపాలిటీలు గెలిచి తీరాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. నామినేషన్లు వేస్తుంటే నక్కజిత్తుల భాస్కర్ రావు బెదిరిస్తున్నాడంటున్నారని, కానీ తాము ఇక్కడ ఉన్నది జానారెడ్డి లాంటి మంచి మనసు ఉన్నోళ్లం కాదని, బెదిరిస్తే చింతపండు అవుతుందని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం వెళ్లే వరకూ తరిమి కొడతామని అన్నారు. మరో ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటామని, మున్సిపాలిటీలను అద్దం లాగా తీర్చి దిద్దుతామని తెలిపారు. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడయినా... మంచి కార్డులు మొదలు పెట్టినా నల్లగొండ నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారు ఆలోచించాలని, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో? ఎవరు కుటుంబానికి పదవులు ఇచ్చి వేల కోట్లు దండుకుంటారో ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఓటేసేముందు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మఇళ్లు, ఉచిత విద్యుత్తు, తక్కువ ధరకే గ్యాస్ వంటివి ఎవరు ఇస్తారో గుర్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News