మళ్లీ ప్రయాణం మొదలు.. లాక్ డౌన్ భయంతో

వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లాక్ డౌన్ భయంతో వారు తమ సొంత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల నుంచి [more]

Update: 2021-04-10 01:00 GMT

వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లాక్ డౌన్ భయంతో వారు తమ సొంత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల నుంచి వలస కార్మికులు వివిధ రవాణా మార్గాల ద్వారా బయలు దేరారు. కొందరు రైళ్లలో వెళుతుండగా, మరికొందరు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మంది వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని చెబుతున్నారు. లాక్ డౌన్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా కరోనా కేసులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో వారు తమ స్వస్థలాలకు బయలు దేరి వెళ్లిపోయారు.

Tags:    

Similar News