విచారణకు రఘురామ రావడం లేదట

ఎమ్మెల్యే ఎర కేసులో విచారణకు నేడు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు హాజరు కావడం లేదు

Update: 2022-11-29 04:42 GMT

ఎమ్మెల్యే ఎర కేసులో విచారణకు నేడు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు హాజరు కావడం లేదు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం 41 ఎ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు రఘురామ కృష్ణరాజు కు తెలిపారు. ఈ మెయిల్ ద్వారా ఆయనకు ఈ మేరకు సమాచారం పంపారు.

ఎమ్మెల్యేల ఎర కేసులో...
రఘురామ కృష్ణరాజు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వంద కోట్లు ఇస్తానని రఘురామ కృష్ణరాజు చెప్పారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను విచారించాలని సిట్ భావించింది. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని కోరింది. కానీ కారణాలేంటో తెలియదు కాని ఈరోజు విచారణకు అవసరం లేదని, తాము మరోసారి పిలిచినప్పుడు మాత్రం హాజరు కావాలని సిట్ ఈ మెయిల్ ద్వారా రఘురామ కృష్ణరాజుకు తెలిపింది.


Tags:    

Similar News