ఆగస్టు 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. తెలుసుకోండి..!

గోల్కొండ కోటకు వెళ్లే వివిధ రహదారుల దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.

Update: 2022-08-14 02:54 GMT

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలోని రాణి మహల్‌ లాన్‌లో ఇండిపెండెన్స్‌ డే వేడుకలను నిర్వహిస్తోంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రహదారిని మూసి వేస్తున్నారు. గోల్కొండ కోటకు వెళ్లే వివిధ రహదారుల దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. షేక్‌పేట నాలా, టోలీచౌకీ, సెవెన్‌ టూంబ్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయి. సాధారణ ప్రజలు షేక్‌పేట, టోలీటౌకీ ప్రాంతం నుంచి గోల్కొండ కోటకు చేరుకోవాలి. వారి వాహనాలను సెవెన్‌ టూంబ్స్‌ దగ్గర పార్క్‌ చేయాల్సి ఉంటుంది. గోల్కొండ కోటకు వచ్చే వాహనాలకు పోలీసులు నాలుగు రకాల పాసులు జారీ చేశారు. గోల్డ్‌, పింక్‌, బ్లూ, గ్రీన్‌ కలర్‌లో ఉండే మూడు రకాల పాసులను జారీ చేశారు. సికింద్రాబాద్‌, బంజారాహిల్స్‌, మాసాబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం ప్రాంతాల నుంచి వీరంతా గోల్కొండ కోటకు చేరుకోవాల్సి ఉంటుంది. గోల్డ్‌ కలర్‌ పాసులు ఉన్న వాహనదారులు ఫతే దర్వాజ రోడ్‌లో ఉన్న గోల్కొండ కోట ముందున్న స్థలంలో తమ వాహనాలను పార్క్‌ చేయాల్సి ఉంటుంది. పింక్‌ కలర్‌ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ బస్‌ స్టాప్‌లో తమ వాహనాలను పార్క్‌ చేయాలి. బ్లూ కలర్‌ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ బస్‌ స్టాప్‌కు రైట్‌ సైడ్‌ లో ఉన్న ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో వెహికిల్స్‌ పార్క్‌ చేయాలి. గ్రీన్‌ కలర్‌ పాసులు ఉన్న వాహనదారులు సెవెన్‌ టూంబ్స్‌ నుంచి వాహనాలను పార్క్‌ చేయాలి.

అప్పర్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం 'సండే ఫండే' కార్యక్రమాన్ని పునఃప్రారంభించడంతో, ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. తెలుగు తల్లి నుండి ట్రాఫిక్ లిబర్టీ, హిమాయత్ నగర్ వైపు మళ్లించబడుతుంది. DBR మిల్స్ నుండి ట్రాఫిక్ DBR మిల్స్ వద్ద గోసాల, తరువాత కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు మళ్లించబడుతుంది.
తెలుగుతల్లి వైపు నుంచి వచ్చే వారు వాహనాలను ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పార్క్ చేయాలి. లిబర్టీ వైపు నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్ స్లిప్ రోడ్డు వద్ద పార్క్ చేయాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను బుధ భవన్ రోడ్డు, నెక్లెస్ రోడ్డులో పార్క్ చేయాలి.


Tags:    

Similar News