నిమజ్జనంపై కీలక తీర్పు

వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-09-25 07:29 GMT

వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ తో పాటు నగరంలోని చెరువులలో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు జీహెచ్‌హెంసీ అధికారులకు కూడా హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అందులోనే...
గణేష్ నిమజ్జనం ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌ లో జరుగుతుంది. ఈ సందర్భంగా జరిపిన విచారణ తర్వా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేేసిన నీటి గుంతలలోనే వాటిని నిమజ్జనం చేయాలని, ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.


Tags:    

Similar News