హైదరాబాద్ లో మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం

హైదరాబాద్ నగరంలో పోలీసులు పెద్దయెత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-05-08 12:24 GMT

హైదరాబాద్ నగరంలో పోలీసులు పెద్దయెత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3.16 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎస్.ఓ.టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్, మేడ్చల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారాన్ని ఎందుకు? ఎక్కడకు తీసుకెళుతుందన్న దానిపై నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తనిఖీలు చేస్తుండగా....
పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగరంలో పెద్దయెత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఇప్పటికే కోట్ల రూపాయల నగదును పట్టుకున్నారు. తాజాగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానికి సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో పట్టుకున్నామని తెలిపారు. నిందితులను విచారించనున్నారు.


Tags:    

Similar News