జర్నలిస్టులకు ఓయూలో శిక్షణ.. 9న సదస్సు...

తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై జాతీయ సదస్సు జరగనుంది.

Update: 2022-07-08 10:26 GMT

తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై జాతీయ సదస్సు జరగనుంది. ఈ నెల 9వ తేదీన జరిగే ఈ సదస్సును యూఎస్ కానసులేట్ జనరల్ తో కలసి ఉస్మానియా జర్నలిజం విభాగం నిర్వహిస్తుంది. ఇప్పికే తెలుగు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సును 90 గంటల శిక్షణ కార్యక్రమంలో భాగంగా యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ ప్రారంభించి ప్రసంగించననున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

తప్పుడు సమాచారాన్ని...
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, డేటాలీడ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ సయ్యద్ నజాకత్, భూమ్ లైవ్ న్యూస్ దక్షిణాది ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ ప్రసంగించనున్నారు. ప్రధాన మీడియాతో పాటు, యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సదస్సులో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఇందులో యాభై శాతం మహిళా జర్నలిస్టులే ఉన్నారు. గూగుల్ గుర్తింపు పొందిన ఫ్యాక్ట్ చెక్ శిక్షకుల ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని తొలగించేందుకు ఉపయోగించే సాధనాలు, అభ్యాసాలపై ఇక్కడ శిక్షణ పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి యూఎస్ కాన్సులేట్ జనరల్ నిధులు సమకూరుస్తుందని, రవాణా, మౌలిక వసతులు తదితర అంశాలు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ఏర్పాటు చేస్తుంది.


Tags:    

Similar News