హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు

హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇరవై ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు

Update: 2023-02-28 02:25 GMT

హైదరాబాద్ లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇరవై ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ ఉదయం నుంచి తనిఖీలు ప్రారంభించారు.

రియల్ ఎస్టేట్ కంపెనీలపై...
రియల్ ఎస్టేట్ కంపెనీ గూగికి చెందిన ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్‌సుఖ్ నగర్ లోని ప్రధాన కార్యాలయంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఫార్మాహిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈ సోదాలు తెల్లవారు జామునుంచే జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ప్రధాన కారణంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News