మ‌ల‌క్‌పేట హిట్ అండ్ ర‌న్: తుదిశ్వాస విడిచిన డాక్ట‌ర్ శ్రావ‌ణి

శ్రావ‌ణి కుటుంబంతో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇది రెండో విషాదమవ్వడం మరింత బాధాకరమైన విషయం.

Update: 2022-09-24 11:20 GMT

మ‌ల‌క్‌పేట హిట్ అండ్ ర‌న్ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన డాక్ట‌ర్ శ్రావ‌ణి మరణించారు. గ‌త మూడు రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రావ‌ణి ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించింది. ప్ర‌మాదంలో త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతోనే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. హస్తినాపురంలోని ఓ డెంటల్ ఆస్ప‌త్రిలో శ్రావ‌ణి డాక్ట‌ర్‌గా ప‌ని చేస్తోంది. ఈ నెల 21న ఓలా బైక్ బుక్ చేసుకుని వెలుతుండ‌గా.. గుర్తు తెలియ‌ని కారు వేగంగా వ‌చ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ డ్రైవ‌ర్ వెంక‌ట‌య్య‌, శ్రావ‌ణి గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ శ్రావ‌ణి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారును న‌డిపింది ఓల్డ్ మ‌ల‌క్‌పేట‌కు చెందిన ఇబ్ర‌హీంగా గుర్తించారు. అత‌డికి లైసెన్స్ లేద‌ని, కారుకు పేపర్లు లేవ‌ని తెలుస్తోంది.

శ్రావ‌ణి కుటుంబంతో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇది రెండో విషాదమవ్వడం మరింత బాధాకరమైన విషయం. 25 రోజులు కింద‌టే శ్రావ‌ణి వాళ్ల అమ్మ గుండెపోటుతో మ‌ర‌ణించింది. నెల‌రోజుల్లోనే త‌ల్లీ, కూతురు మ‌ర‌ణించ‌డంతో ఆ ఇంట్లో విషాద చాయ‌లు అలుముకున్నాయి.


Tags:    

Similar News