హైదరాబాద్‌లో 11 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..

వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగరం సందడి వాతావరణం నెలకొంటుంది. వినాయకులతో రహదారరులన్ని రద్దీగా మారుతాయి..

Update: 2023-09-18 08:06 GMT

వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగరం సందడి వాతావరణం నెలకొంటుంది. వినాయకులతో రహదారరులన్ని రద్దీగా మారుతాయి. వినాయక పండగ రోజు నుంచి నిమజ్జనం అయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారు. అయితే ఈ గణేష్ పండగకు ప్రతిసారి నగరంలో పలు రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తుంటారరు పోలీసులు. అలాగే ఇప్పుడు కూడా హైదరాబాద్‌ నగరరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నారు. భాగ్యనగర వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు గణపతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే నగర పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిటీ పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గణేష్‌ నవరాత్రుల సందర్భంగానగర ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఉత్సవాలు జరిగేలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. నగరంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రసిద్ధి.

ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది భక్తులతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రలు వస్తుంటారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఖైరతాబాద్ పరిసరాల్లో రానున్న 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు నేటి నుంచి అంటే సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
నగరంలో ఏయే రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు అంటే..
☛ రాజ్‌దూత్ లైన్ నుంచి- గణేష్ టైపు రోడ్డులో సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. అటుగా వెళ్లే వెహికిల్స్‌ని రాజ్‌దూత్ లైన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లిస్తారు.

☛ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌‌కి కూడా అనుమతి లేదు. అటు వైపుగా వెళ్లే వెహికిల్స్‌ని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపుకు డైవర్ట్ చేస్తారు.

☛ మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ థియేటర్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు. అటు వైపు వెళ్లే వెహికిల్స్‌ని మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపుకు డైవర్ట్ చేస్తారు.

☛ కాగా, వాహనదారులు ఈ 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు కోరారు. అలాగే ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు.


Tags:    

Similar News