సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది

Update: 2025-11-17 12:06 GMT

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని అందచేయాలని నిర్ణయించింది. అదే సమయంలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు వీలు లేదు కనుక అక్కడే అంత్యక్రియలను నిర్వహంచాలని కూడా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు.

సౌదీకి తీసుకెళ్లి...
బాధిత కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు కుటుంబ సభ్యులతో పాటు మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు, ఒక అధికారిని సౌదీకి పపంపించి అక్కడే మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది మృతి చెందారు. వీరంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారే కావడంతో మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News