ఫేక్ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నించిన మహిళలు

ఫేక్ వీసాలతో ఎంచక్కా విమానం ఎక్కి కువైట్ కు ఎగిరిపోవచ్చనుకున్నారు 44 మంది మహిళలు

Update: 2021-12-07 13:13 GMT

ఫేక్ వీసాలతో ఎంచక్కా విమానం ఎక్కి కువైట్ కు ఎగిరిపోవచ్చనుకున్నారు 44 మంది మహిళలు. ఆఖరికి ఎయిర్ పోర్టు సిబ్బంది వారిని గుర్తించడంతో..ప్రయాణానికి బ్రేక్ పడింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విచారణకు...
ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళలను ప్రశ్నిస్తున్నారు. వారందరినీ ఏజెంట్ మోసం చేశాడా ? లేక ఉద్దేశ పూర్వకంగా వారే నకిలీ వీసాలను సృష్టించుకుని కువైట్ వెళ్లేందుకు యత్నించారా ? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. 44 మంది మహిళల్లో తెలంగాణతో పాటు ఏపీ, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News