Breaking: హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్ లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ సోదాలను నిర్వహిస్తుంది. పది ప్రాంతాల్లో ఈ తనిఖీలను నిర్వహిస్తుంది

Update: 2022-09-19 08:00 GMT

హైదరాబాద్ లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం పది ప్రాంతాల్లో ఈ తనిఖీలను నిర్వహిస్తుంది. ఈ సోదాల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్ కు చెందిన ఒక బిల్డర్ నివాసం, కార్యాలయంలోనూ ఈ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం.

మూడు ఐటీ కంపెనీలపై....
వీటితో పాటు రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆరు బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయా? లేక మరో అంశంపై ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News