Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మరణించారు
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మరణించారు. హైదరాబాద్ లోని విద్యానగర్ కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని పద్దెనిమిది మంది ఈ ప్రమాదంలో మరణించారు. నసీరుద్దీన్ రైల్వే శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి మక్కా యాత్రకు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో నసీరుద్దీన్ కుటుంబంలోని పద్దెనిమిది మంది మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారు.
విద్యానగర్ కు చెందిన...
హైదరాబాద్ లోని విద్యానగర్ లోని ఆయన నివాసానికి పెద్దయెత్తున బంధువులు, స్నేహితులు చేరుకుని అక్కడ ఉన్న వారిని పరామర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శంచారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన నలభై ఐదు మంది మరణించిన సంగతి తెలిసిందే.