ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం పంజాబ్-హర్యానాలో వరదల దుస్థితిని చూపడం లేదు, 2017 నాటిది
ఈ వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా
Bihar 2017 floods
ఈ వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కనీసం 500 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇళ్ళు కూలిపోవడం లాంటి ఘటనల కారణంగా డజన్ల కొద్దీ ప్రాణాలు బలయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి, నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహించాయి, పంటలపై తీవ్ర ప్రభావం చూపించింది. వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తుతుండడంతో వేలాది మంది చిక్కుకుపోయారు. పంజాబ్లోని 23 జిల్లాలన్నింటినీ వరద బాధిత ప్రాంతాలుగా ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1,400 గ్రామాలు మునిగిపోయాయని, 3.54 లక్షల మంది నిరాశ్రయులయ్యారని పంజాబ్ రెవెన్యూ మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. రావి, బియాస్, సట్లెజ్ నదులలో నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయి. కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు.