అమరావతి రైతులకు అండగా...?

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు పలికింది.

Update: 2021-11-24 13:44 GMT

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు పలికింది. ఇప్పటివరకూ అమరావతికి మద్దతు తెలిపినా రైతుల పాదయాత్రలో జనసేన పాల్గొనడం లేదు. అయితే ఈరోజు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన నెల్లూరు జిల్లాలో రైతుల మహా పాదయాత్రలో జనసేన నేతలు పాల్గొంటారని ఆ పార్టీ ప్రకటించింది.

పాదయాత్రలో నాదెండ్ల...
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 26వ తేదీన రైతులను కలసి సంఘీభావం ప్రకటిస్తారు. పాదయాత్రలోనూ రైతులతో కలసి పాల్గొంటారని జనసేన పార్టీ తెలిపింది.


Tags:    

Similar News