ఆరోరోజుకు చేరిన రైతుల పాదయాత్ర

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పాదయాత్ర ఆరోరోజుకు చేరుకుంది.

Update: 2022-09-17 07:47 GMT

ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పాదయాత్ర ఆరోరోజుకు చేరుకుంది. ఈరోజు రేపల్లె నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తో పాటు టీడీపీ శ్రేణులు రైతులకు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం ఐలవరం నుంచి బయలుదేరిన యాత్ర రేపల్లె నియోజకవర్గానికి చేరుకుంది.

అన్ని వర్గాల ప్రజలు...
కాగా ఈ పాదయాత్రలో రైతులతో పాటు వివిధ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పాల్గొంటున్నారు. గ్రామాల పొడవునా రైతులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ నెల 12న రైతుల మహాపాదయాత్ర ప్రారంభమయింది. మహిళలు, రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్న ఈ యాత్రకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.


Tags:    

Similar News