Devineni Uma : దేవినేని ఆలోచన అదే.. నిజంగా అదే జరిగితే గెలుపు గ్యారంటీ అట
దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచన మారినట్లు కనిపించింది. ఆయన ఇక ఈ టర్మ్ లో ఏ పదవి కోరుకోన్నట్లే కనపడుతుంది
దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచన మారినట్లు కనిపించింది. ఆయన ఇక ఈ టర్మ్ లో ఏ పదవి కోరుకోన్నట్లే కనపడుతుంది. ఏ పదవి తీసుకున్నా తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతానేమోనన్న భయం పట్టుకుంది. అందుకే దేవినేని ఉమ తన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పుడుతన్నాయి. దేవినేని ఉమ రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగింది. అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమ మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలు కావడంతో దేవినేని రాజకీయం టర్న్ తీసుకుంది.