ఏపీలో కరోనా అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 222 కొత్త కేసులు నమోదయ్యాయి

Update: 2021-11-18 12:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 222 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,70,738 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,423 మంది మరణించారు.

తగ్గిన యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,53,755 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,560 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,00,66,415 నమూనాలను పరీక్షించారు.


Tags:    

Similar News