ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 196 కొత్త కేసులు నమోదయ్యాయి

Update: 2021-11-23 12:13 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 196 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒకరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,71,567 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,429 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,54,979 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,159 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,02,23,680 నమూనాలను పరీక్షించారు


Tags:    

Similar News