ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 247 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2021-11-24 12:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 247 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒకరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,71,831 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,430 మంది మరణించారు.

కోలుకున్న వారు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,55,226 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,175 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,02,55,667 నమూనాలను పరీక్షించారు


Tags:    

Similar News