ఏపీలో కూడా రంజాన్ సందర్భంగా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ సమయంలో ఎవకూ మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవద్దని, ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు. ముస్లిం మత [more]

Update: 2020-04-21 02:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ సమయంలో ఎవకూ మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవద్దని, ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు. ముస్లిం మత పెద్దలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా వ్యాధితో అన్ని పండగలు ఇళ్లకే పరిమితమయ్యాయని చెప్పారు. ఎలాంటి మత ప్రార్థనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ఏ పండగయినా ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. కరోనాను కట్టడి చేయాలంటే ఇదే మార్గమని తెలిపారు. తమ ప్రభుత్వం రంజాన్ తోఫా పేరిట ఏడాది కొకసారి కాకుండా ప్రతి నెల పేదలు ఇబ్బంది పడకుండా చూస్తుందని జగన్ తెలిపారు.

Tags:    

Similar News