నేడు హైదరాబాద్ కు జగన్ ఎందుకంటే?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ ఒక వివాహ వేడుకలో జగన్ [more]

Update: 2020-01-29 08:11 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడ ఒక వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారు. అయితే జగన్ హైదరాబాద్ పర్యటనను టీడీపీ వివాదాస్పదం చేసింది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకానందరెడ్డి కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన సోదరి సునీతను నచ్చ చెప్పేందుకే జగన్ హైదరాబాద్ కు వెళుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యకేసులో అసలైన దోషులను శిక్షించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News