నేడు గవర్నర్ ను కలవనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ ను కలవనున్నారు. ఆయనతో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానున్నారు. ఇటీవల నలుగురు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ ను కలవనున్నారు. ఆయనతో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానున్నారు. ఇటీవల నలుగురు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ ను కలవనున్నారు. ఆయనతో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానున్నారు. ఇటీవల నలుగురు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను రాజ్ భవన్ కు ప్రభుత్వం పంపింది. అయితే ఇందులో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని గవర్నర్ అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా జగన్ గవర్నర్ ను కలవనున్నారని తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డిపై క్రిమినల్ కేసులు ఉండటంతో గవర్నర్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా జగన్ గవర్నర్ కు వివరించే అవకాశముంది.