తెలంగాణలో నేడు 25 వేల మంది డిశ్చార్జ్

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటవ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

Update: 2020-04-09 01:33 GMT

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటవ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కు చేరుకుంది. ఇంకా కరోనా పాజిటివ్ రావడంతో 397 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 4 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది వరకూ తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందారు. అయితే తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ గడువు పూర్తి కానుండటంతో నేడు వారిని డిశ్చార్జ్ చేయనున్నారు. దాదాపు 25 వేల మందికి నేటితో తెలంగాణలో క్వారంటైన్ గడువు పూర్తవుతుంది. వారిని నేడు డిశ్చార్జ్ చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News