బీజేపీకి దూరంగా లేను

బీజేపీకి తాను దూరంగా లేనని కలసి ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను బీజేపీకి దగ్గరగానే ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంలో తాను [more]

Update: 2019-12-04 07:40 GMT

బీజేపీకి తాను దూరంగా లేనని కలసి ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను బీజేపీకి దగ్గరగానే ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంలో తాను బీజేపీని విభేదించానని చెప్పారు. అమిత్ షా అంటే వైసీపీకి భయమని, తనకు గౌరవమని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను హోదా ఇవ్వలేదన్న కోపం తోనే బీజేపీతో కలిసి పోటీ చేయలేదన్నారు. అందుకే ఒంటరిగా పోటీ చేశానని చెప్పారు. తాను బీజేపీ, టీడీపీతో గత ఎన్నికల్లో కలసి పోటీ చేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అందుకే వైసీపీ నేతలు తనకు చేతులెత్తి దండం పెట్టాలని కోరారు.

Tags:    

Similar News