టెన్త్ పరీక్షలు జరపలేకపోతున్నాం.. టెన్షన్ పడకండి

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ను పొడిగించిన కారణంగా పదో తరగతి పరీక్షలు జరపలేకపోతున్నామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మే 3వ తేదీ వరకూ లాక్ [more]

Update: 2020-04-14 07:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ను పొడిగించిన కారణంగా పదో తరగతి పరీక్షలు జరపలేకపోతున్నామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించడంతో పరీక్షలు ఇప్పట్లో జరిపే అవకాశం లేదన్నారు. విద్యార్థులు లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని, సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులు ఆన్ లైన్ పాఠాలను నిర్వహిస్తున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Tags:    

Similar News