శ్రీకాకుళం: పలాస సమీపంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది

శ్రీకాకుళం జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కప్లింగ్ విరగడంతో రైలు విడిపోయింది. ప్రయాణికుల్లో భయాందోళనలు వెల్లివిరిశాయి.

Update: 2025-04-08 05:49 GMT

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వైపు వెళ్తున్న 12704 ఫలక్‌నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, పలాస-మందస స్టేషన్ల మధ్య కప్లింగ్ విరిగిపోవడంతో రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.   

ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకపోవడం ఊరట కలిగించింది.

 ఘటనపై పూర్తి వివరాలను రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది.

Tags:    

Similar News