అన్నదానం చేసిన వ్యక్తికి పాజిటివ్… ఆందోళనలో?

హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లోని మధురానగర్ లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయితే ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పేదలకు [more]

Update: 2020-04-18 04:35 GMT

హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లోని మధురానగర్ లో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అయితే ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి నేరేడ్ మెట్ పోలీసులు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో అన్నదానానికి, నిత్యావసర వస్తువుల పంపిణీకి హాజరయిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు.

Tags:    

Similar News