కవిత టార్గెట్ గా పోస్టర్లు

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు వేస్తే, కవితకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు వేశారు

Update: 2023-03-18 12:30 GMT

హైదరాబాద్ లో మరోసారి పోస్టర్లు కలకలం రేపాయి. బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోస్టర్ల యుద్ధం నడుస్తుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు వేస్తే, కవితకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈ పోస్టర్లు హైదరాబాద్ బేగంపేట్ మెట్రో పిల్లర్ పై గుర్తు తెలియని వ్యక్తులు వేశారు. ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిశాయి.

పోలీసులు సీరియస్...
‘కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్’.. ‘కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం’.. ‘కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్ 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట’.. ‘తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా’ అంటూ పోస్టర్లలో ముద్రించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags:    

Similar News