రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాలు మూసివేత

వీఐపీల రాకపోకల నేపథ్యంలో.. వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపుల అప్పటి..

Update: 2023-04-29 08:26 GMT

hyderabad new secretariat opening

తెలంగాణ చరిత్రలో మరో కలికితురాయి గా నిర్మితమైన నూతన సచివాలయం రేపు (ఏప్రిల్ 30) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్‌‌, సైఫాబాద్‌, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబనీపార్క్‌, నెక్లెస్‌ రోడ్డును పూర్తిగా మూసి వేస్తున్నట్టు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

వీఐపీల రాకపోకల నేపథ్యంలో.. వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయడం, ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద ట్రాఫిక్ కు అనుమతి లేదన్నారు. ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి, బీఆర్‌‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌‌ మార్గ్‌ రూట్‌ లలో ఎలాంటి వాహనాలకూ అనుమతి లేదన్నారు. సచివాలయ ప్రారంభోత్సానికి వచ్చే ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయించామని, ప్రారంభోత్సవానికి విచ్చేసే వారంతా తమతమ వాహనాలకు పాస్ లను ఖచ్చితంగా స్టిక్ చేసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News