క్షమించమని కోరుతున్న మంత్రి తలసాని

హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో జరిగిన స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి

Update: 2023-08-26 04:02 GMT

హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌లో జరిగిన స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ భైంసా ఏఎంసీ ఛైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబును నెట్టేసిన ఘటన వివాదాస్పదం అయింది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వివరణ ఇచ్చారు. జనం రద్దీ ఉన్న కార్యక్రమంలో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని, ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని అన్నారు. అతను గిరిజనుడు భైంసా ఏఎంసీ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌ బాబు అని తెలిసిందని, వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి పొరపాటు జరిగిందని, క్షమాపణ చెప్పానని అన్నారు. ఈ ఘటనపై అతనితో పాటు గిరిజన సమాజానికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో విషయం పెద్దది చేసి చూపుతున్నారని.. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీల గొంతుకనని అన్నారు. ఎటువంటి బేషజం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

బైంసా ఏఎంసీ ఛైర్మన్‌ రాజేష్‌బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తలసాని వెల్లడించారు. అంతకు ముందు గిరిజన ప్రజాప్రతినిధి, భైంసా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జాదవ్‌రాజేష్‌పై భౌతికదాడికి పాల్పడిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు పలు ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాజేష్‌బాబు కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్తుంటే తన ముందు నడుస్తున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెనుక నుంచి కాలర్‌పట్టి, మళ్లీ ముందుకు వచ్చి చెంప మీద కొట్టి అవమానించారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజాక్షేత్రంలో, ప్రజాసేవ కొరకు వచ్చిన గిరిపుత్రుడికి కావాలనే అవమానించారంటూ పోస్టులు పెట్టడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News