నేడు టెన్త్ ఫలితాల విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితలు ఈరోజు విడుదల కానున్నాయి

Update: 2022-06-30 03:14 GMT

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే పరీక్ష ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు కరోనా కారణంగా జరగలేదు. దీంతో రెండేళ్ల తర్వాత ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.

కొద్దిరోజులుగా...


పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షల మందికి పైగానే విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది 11 ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు నిర్వహించారు. టెన్త్ పరీక్షల ఫలితాల కోసం కొద్దిరోజులుగా విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొంత సమయం తీసుకుని ఈరోజు ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.


Tags:    

Similar News