గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు

Update: 2022-10-02 06:07 GMT

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించి ఈ మేరకు పూర్తి చేయించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు...
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాద్ తో పాటు ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేశారు.


Tags:    

Similar News