Narendra Modi : నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Update: 2024-04-30 02:40 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. మెదక్ జిల్లాలోని దుర్గం ఐబీ స్క్వేర్ లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలో మెదక్, బీజేపీ పార్లమెంటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానని నిర్వహించనున్నారు.

మెదక్ జిల్లాలో...
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోదీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని కోరారు. ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణలో అత్యధిక స్థానాలను లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే దిశగా ఆ పార్టీ ప్రయాత్నాలు ప్రారంభించింది.


Tags:    

Similar News