మోదీ ఎదుట కేసీఆర్ హోర్డింగ్

ఇటీవల తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు స్వాగతం పలికాయి

Update: 2023-04-10 03:54 GMT

ఇటీవల తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు స్వాగతం పలికాయి. బీజేపీని విమర్శిస్తూ కేసీఆర్ ను ప్రశంసిస్తూ అనేక చోట్ల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లే మార్గంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.

కేసీఆర్ ఈజ్ కింగ్....
కేసీఆర్ ఈజ్ కింగ్ అంటూ పెట్టిన హోర్డింగ్ మోదీ కంట పడింది. వాహనంలో కూర్చుని ఉన్న మోదీ ఆ హోర్డింగ్‌ను తదేక దృష్టితో చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మోదీతో విభేదించిన నాటి నుంచి ఎప్పుడు పర్యటన ఉన్నా బీఆర్ఎస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు పెడుతున్నారు.


Tags:    

Similar News