కాంగ్రెస్‌ను అస్థిరపర్చే కుట్ర : రేవంత్

కాంగ్రెస్‌ను అస్థిరపర్చే కుట్రను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2023-04-10 13:09 GMT

కాంగ్రెస్‌ను అస్థిరపర్చే కుట్రను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కుమారస్వామికి వందల కోట్లు ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలన్న ధ్యేయంతోనే వందల కోట్ల నిధులను పంచి పెడుతున్నారన్నారు.

వందల కోట్ల నిధులను...
గతంలోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక పార్టీకి వందల కోట్ల నిధులను ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కర్ణాటకపై పెట్టారన్నారు. భూములు వనరులుగా పెట్టుకుని నిధులు సమీకరిస్తున్నారన్నారు. తన అనుచరులకు అప్పనంగా భూదానాలు చేస్తూ నిధులను తెచ్చుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలవదని, కాంగ్రెస్ ను కర్ణాటకలో ఓడించలేరని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News