Breaking : కవితకు దక్కని రిలీఫ్.. తీహార్ జైలులోనే

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడింది

Update: 2024-04-08 04:38 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడింది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటీషన్ విచారణ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని ఊహించిన ఆమె అభిమానులకు నిరాశ ఎదురయింది.

తీహార్ జైలులోనే...
కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వవద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరుపున న్యాయవాదులు వాదించారు. అదే సమయంలో ఆమె కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరుపున న్యాయవాదులు వాదించారు. అయితే కవిత కు న్యాయస్థానంలో ఊరట దక్కలేేదు. మార్చి 15న అరెస్టయి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.


Tags:    

Similar News