మాజీ ఎమ్మెల్యే కన్నుమూత : ప్రముఖుల సంతాపం
ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా..
ex mla kothakota dayakar reddy
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పరకాపురం. ఆయన మూడుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుండి రెండుసార్లు, మక్తల్ నుండి ఒకసారి గెలుపొందారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.