బుచ్చిబాబుకు ఈడీ సమన్లు

లిక్కర్‌ స్కాంలో కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది

Update: 2023-03-13 13:08 GMT

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించింది. కవిత బినామీగా పేర్కొన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి బుచ్చిబాబును విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో..ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సోమవారం ఈడీ ఇవాళ అరుణ్‌ రామచంద్ర పిళ్లైను హాజరుపర్చి తన వాదనలు వినిపించింది. తన వాంగ్మూలం ఉపసంహరించుకునేందుకు ఆయన స్పెషల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారన్న ఈడీ తరుపున న్యాయవాది పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

పిళ్లైపై వత్తిడి లేదు...
విచారణ సమయంలో పిళ్లైను ఒత్తిడి చేయలేదని అననారు. తాము పిళ్లైను బెదిరించలేదని, టార్చర్‌ కూడా చేయలేదని ఈడీ కోర్టును తెలిపింది. పిళ్లై 2022, సెప్టెంబరు 18వ తేదీన పూర్తి స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్ చేశారని, ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్‌మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారని ప్రశ్నించారు మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారన్నారు. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోందన్నారు. ఒక బలమైన వ్యక్తిని మేము సమ్మన్ చేసినప్పుడు పిళ్లై తన స్టేట్‌మెంట్ మార్చుకున్నారని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది.


Tags:    

Similar News