తెలంగాణలో కరోనా అప్‌డేట్

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. వందలోపే కేసులు నమోదవుతున్నాయి.

Update: 2022-09-25 03:26 GMT

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. వందలోపే కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో తెలంగాణలో 99 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 99 మంది ఒక్కరోజులోనే కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదు. కరోనా పాజిటివిటీ రేటు99.42 శాతంగా నమోదయిందని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ లోనే...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,37,326 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,32,510 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం 705 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 50 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News