తెలంగాణలో స్థిరంగా కరోనా

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 507 కేసులు నమోదయ్యాయి. ఎటువంటి మరణాలు సంభవించలేదు

Update: 2022-08-18 02:42 GMT

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 507 కేసులు నమోదయ్యాయి. ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇందులో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 205 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కరోజులోనే కరోనా నుంచి 605 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

యాక్టివ్ కేసులు...
దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా బారినపడిన వారి సంఖ్య 8,30,380కి చేరింది. వీరిలో చికిత్స పొంది 8,23,272 కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,997 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.


Tags:    

Similar News