తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 435 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

Update: 2022-08-19 04:05 GMT

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 435 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే 612 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 99.47 శాతంగా నమోదయింది. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలో 199 కరోనా కేసులు నమోదయ్యాయి.

యాక్టివ్ కేసులు....
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,30,815 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో కరోనా నుంచి 8,23,884 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,820 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News