తెలంగాణలో కొనసాగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 345 కరోనా కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 345 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒక్కరోజులో 265 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 99.19 శాతంగా నమోదయింది. నమోదయిన కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నాయి. 146 కరోనా కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,32,219 కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,25,356 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికరులు తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 2,752 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా 9,99,509 కి పరీక్షలు నిర్వహించారు.