ఈడీ ఆఫీసుకు కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు

Update: 2023-03-21 06:04 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. మూడోసారి కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారు. తన ఫోన్లను మీడియాకు చూపిస్తూ కల్వకుంట్ల కవిత ఈడీ ఆఫీస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. నిన్నటి విచారణలో ఈడీ అధికారులు ఫోన్లను తీసుకురావాలని చెప్పి ఉంటుందని, అందుకే ఆమె తను వినియోగించిన ఫోన్లను మీడియాకు చూపించారని తెలుస్తుంది.

9 ఫోన్లను...
తాను ఫోన్లను ధ్వసం చేయలేదని, అందుకే మీడియాకు చూపిస్తున్నానని కవిత ప్రజలకు చెప్పదలచుకున్నారు. అందుకే 9 ఫోన్లను ఆమె వాహనంలో నుంచే మీడియాకు చూపారు. ఈరోజు విచారణ అంతా ఫోన్లపైనే జరిగే అవకాశముందని తెలిసింది. తన న్యాయవాదులతో కలసి కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులకు ఈ ఫోన్లను కవిత విచారణ సందర్భంగా అందచేయనున్నారు. తన ఫోన్లను ఈరోజు ఈడీ కార్యాలయంలో అప్పజెప్పడానికి కూడా వచ్చానని, ఈడీ తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆమె ఈడీ డైెరెక్టర్ కు లేఖ కూడా రాశారు.


Tags:    

Similar News