KCR : నేటి నుంచి జనంలోకి కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు

Update: 2024-04-13 02:40 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయన బస్సు యాత్ర సిద్ధం కానుంది. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేటి నుంచి ప్రజల వద్దకు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.

చేవెళ్ల నుంచి...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగే తొలి సభ కావడంతో దానిని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడకు చేరుకుని ప్రసంగించనున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ప్రసంగాలు సాగనున్నాయి. తాను అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులను ఆయన వివరించనున్నారు.


Tags:    

Similar News